భగీరథ యత్నం వీడని రెవెన్యూ అందత్వం
---నిరుపేద కుటుంబం పట్ల అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ----మంత్రి పొంగులేటి చొరవ తీసుకుని సమస్య పరిష్కరిం చాలి ----స్థానికులు, మానవతా వాదుల విజ్ఞప్తి ఇల్లందు ప్రతినిధి, సెప్టెంబర్ 4( తరంగాలు): ప్రభుత్వాలెన్ని మారినా, ఆంధ్ర ఆధిపత్య నాయకత్వంతో కొట్లాడి సొంతంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకుని సొంతింటి ప్రభుత్వం కొలువు దీరినా అభాగ్యుల బతుకుల్లో కాసింత కూడా వెలుగు కానరాని పరిస్థితి నెలకొంది. దశాబ్ధ కాలానికి పైగా కొట్లాడి..గోసపడి సాధించుకున్న సొంత రాష్ట్రం లో ఆడబడుచులకు ఇంటి ముంగిట్లోకి తాగునీరు సరఫరా చేసేందుకు గొప్పగా అమలు చేసిన మిషన్ భగీరథ.. రాష్ట్రంలో ధ్వంసమైన చెరువుల పరిరక్షణకు మిషన్ కాకతీయ పథకం ఓ కుటుంబాన్ని అభాగ్యుల్ని చేసింది. ఉమ్మడి...