EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఓరుగల్లు కాంగ్రెస్ పార్టీ దళిత చైతన్య సభ వాయిదా

    Author THARANGALU NEWS | 29 Aug 2026, 09:07 PM | TELANGANA
    ఓరుగల్లు కాంగ్రెస్ పార్టీ దళిత చైతన్య సభ వాయిదా

    రేపు 30న హయగ్రీవాచారి గ్రౌండ్‌కు ఎవరూ రావద్దు

    సభ నిర్వహించే కొత్త తేదీ, వేదికను త్వరలో ప్రకటిస్తాం

    వరంగల్ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ పసునూరి భాస్కర్

    ఇవి కూడా చదవండి


    వరంగల్ ప్రతినిధి ,ఆగస్టు 29 (తరంగాలు):
    హనుమకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్‌లో వరంగల్, జనగామ, హన్మకొండ జిల్లాల రేపు 30న నిర్వహించాల్సిన “ఓరుగల్లు కాంగ్రెస్ పార్టీ దళిత చైతన్య సభ” అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ వైస్ చైర్మన్ పసునూరి భాస్కర్ శనివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.సభ నిర్వహించే కొత్త తేదీ, వేదికను ఖరారు చేసి ప్రకటించనున్నట్లు తెలిపారు.కొత్త తేదీ, వేదిక ఖరారైన వెంటనే సభ విజయవంతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, కార్యాచరణ ప్రణాళికను వెల్లడిస్తామని పేర్కొన్నారు. సభ వాయిదా నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు, అన్ని మండలాల ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సహకరించాలని కోరారు.సభ వాయిదా పడినందున రేపు 30న హయగ్రీవాచారి గ్రౌండ్‌కు ఎవరూ రావద్దని పసునూరి భాస్కర్ స్పష్టం చేశారు.