EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నేనున్నాను.. భయపడొద్దు..!

    Author THARANGALU NEWS | 18 Sep 2026, 05:58 AM | TELANGANA
    నేనున్నాను.. భయపడొద్దు..!

    అర్ధరాత్రి ఫోన్‌తో భరోసా.. ఉదయానికే ఆసుపత్రికి ఎమ్మెల్యే నాగరాజు

    పరామర్శ కాదు.. బాధ్యత!

    నేనున్నాను.. భయపడొద్దు..! - Additional Image

    ఆదిత్య చికిత్సకు రూ.55 వేల సాయం.. ఎల్‌ఓసీ కోసం సీఎంతో మాట్లాడుతానని హామీ

    ఆదిత్య కుటుంబానికి కొండంత అండ

    నేనున్నాను.. భయపడొద్దు..! - Additional Image

    వైద్యులతో గంటసేపు మాట్లాడి బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా.. మెరుగైన వైద్యం అందించాలని సూచన

    వర్ధన్నపేట ప్రతినిధి, సెప్టెంబర్ 17,తరంగాలు : ప్రజాప్రతినిధి అంటే కేవలం పరామర్శించి వెళ్లిపోవడం కాదు.. కష్టాల్లో ఉన్న ప్రజల కన్నీటిని తుడిచి, అవసరమైన సమయంలో అండగా నిలబడటమే నిజమైన నాయకత్వం. ఈ మాటకు కార్యరూపం చూపించారు వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కె.ఆర్. నాగరాజు.
    వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలుడు మంద కార్తీక్ (ఆదిత్య) డెంగ్యూ జ్వరంతో వరంగల్‌లోని డాల్ఫిన్ చిల్డ్రన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం సామాజిక మాధ్యమాల ద్వారా ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది. బాలుడి ఆరోగ్య పరిస్థితితో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉందని తెలుసుకున్న ఆయన.. ఆలస్యం చేయకుండా స్పందించారు.

    అర్ధరాత్రి.. బాధిత కుటుంబానికి ఫోన్

    ఇవి కూడా చదవండి

    బాలుడి పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే అర్ధరాత్రే బాధిత కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. వారి పరిస్థితిని అడిగి తెలుసుకుని.. చికిత్స విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు.
    “నేనున్నాను.. బాలుడి వైద్యం గురించి భయపడవద్దు” అంటూ ఇచ్చిన భరోసా ఆ కుటుంబానికి కష్టకాలంలో కొండంత ధైర్యాన్నిచ్చింది.

    మాటలకే పరిమితం కాకుండా.. ఉదయానికే ఆసుపత్రికి

    అర్ధరాత్రి ఫోన్ చేసి భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే.. మరుసటి రోజు ఉదయమే స్వయంగా ఆసుపత్రికి చేరుకున్నారు. బాలుడిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.
    వైద్యులతో సుమారు గంటసేపు మాట్లాడి బాలుడికి అందుతున్న చికిత్స, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, వైద్యుల పర్యవేక్షణ తదితర అంశాలను వివరంగా తెలుసుకున్నారు. బాలుడికి అవసరమైన మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.

    రూ.55 వేల సాయం.. భవిష్యత్తులోనూ అండ

    బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే.. వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని తక్షణ సహాయంగా రూ.55 వేల ఆర్థిక సాయం అందజేశారు.
    ఇంతటితో బాధ్యత ముగిసిందని భావించకుండా.. భవిష్యత్తులోనూ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
    అవసరమైన వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి ప్రత్యేక నిధుల కింద ఎల్‌ఓసీ మంజూరు చేయించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

    “ఎమ్మెల్యే కాదు.. మా కుటుంబ సభ్యుడిలా స్పందించారు”

    ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు స్పందించిన తీరుపై ఆదిత్య కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.
    “ఎమ్మెల్యే అంటే పరామర్శించి, ఎంతో కొంత ఇచ్చి వెళ్లిపోతారని అనుకున్నాం. కానీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుడికి ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఎలా స్పందిస్తారో.. అదే విధంగా మా బిడ్డ విషయంలో నాగరాజు స్పందించారు. అర్ధరాత్రి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. మరుసటి రోజు స్వయంగా ఆసుపత్రికి వచ్చి వైద్యులతో మాట్లాడారు. రూ.55 వేల సాయం చేశారు. ఇంకా అవసరమైతే అండగా ఉంటానని చెప్పారు. ఈ మానవత్వాన్ని జీవితంలో మరిచిపోలేం” అని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

    పరామర్శకు కొత్త అర్థం.. ప్రజల పట్ల బాధ్యతకు నిదర్శనం

    ఆసుపత్రికి వెళ్లి ఫొటో దిగడం.. పరామర్శించి వెళ్లిపోవడం కాకుండా, బాధిత కుటుంబం ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడం, అర్ధరాత్రి ఫోన్ చేసి భరోసా ఇవ్వడం, మరుసటి రోజు వైద్యులతో మాట్లాడటం, తక్షణ ఆర్థిక సాయం అందించడం, ప్రభుత్వ సహాయం కోసం ఎల్‌ఓసీ ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడం వంటి చర్యలు ఎమ్మెల్యే స్పందనలోని మానవీయ కోణాన్ని చూపుతున్నాయి.
    “కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా నిలిచేవాడే నిజమైన నాయకుడు..
    మాటతో భరోసా ఇవ్వడమే కాదు.. చేతల్లో అండగా నిలిచేవాడే ప్రజల మనిషి.”
    ఆదిత్య కుటుంబం కష్టకాలంలో ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు చూపించిన స్పందనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతోంది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు పిన్నింటి అనిల్ రావ్, వర్ధన్నపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బాను ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.